Skip to content
Transcript తెలుగు
చూడండి స్వామి యొక్క పరిణామ క్రమాన్ని గనక చూసినట్లయితే భగవంతుడు ఎక్కడ పుడతాడో లేదా ఎక్కడ నది ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. అవతారాలు అక్కడ వస్తాయి. శ్రీరామచంద్రులు సరయు నది దగ్గర పుట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ యమునా నది దగ్గర పుట్టాడు. షిరిడి బాబా గోదావరి నది ప్రవాహం దగ్గర పుట్టాడు. వ్యాసులవారు మన బాసర దగ్గర పుట్టారు. అలా స-- నిజానికి వ్యాసరారు. తర్వాత నెమ్మదిగా బాసర అయిపోయింది. అక్కడి నుంచి నెమ్మదిగా మీరు కృష్ణా జిల్లాకి తుంగమ్మ దగ్గరికి వెళ్తే కృష్ణా నది, పెన్నా నది దగ్గరికి వెళ్తే శ్రీరంగనాథుడు, కావేరీకి మళ్ళీ శ్రీరంగనాథుడు. అట్లాగే అనేకమైనటువంటి విశేషాలు గమనించినట్లయితే సాక్షాత్తు భగవంతుడు ఒక మానవ శరీరం తీసుకొని వచ్చినప్పుడు ఆయన కూడా ఎక్కడ పుట్టారు అంటే చిత్రావతి అనే నది పక్కనే ఆయన కూడా పుట్టారు. [గొంతు సవరించిన శబ్దం] కాబట్టి విన్నాం కాదు ఇవన్నీ నదీ ప్రవాహమే ఇది. నాగరికత అక్కడి నుంచి జగత్తులోకి వెళుతుంది గనుక సమస్తమైనటువంటి ప్రపంచాన్ని ఒక్కటిగా భావించాలని అలాగే ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒక్కటే అని మానవత్వం గనక మనం మరిచిపోయినట్లయితే మనలో గనక మనిషి మాయమైపోయినట్లయితే జన్మ వృథా అని "అన్ని శబ్దాలు కుట్టే నిశ్శబ్దం అందు, అన్ని యుగాలు మొదలాయ యోగం అందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, హరయ్య నారాయణా నమః" అనే శ్లోకం. ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనతో పాటు ఉంటాయి. అందులో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకి మాట్లాడే శక్తి లేదు, గ్రహించే శక్తి లేదు, తన అభిప్రాయాలు చెప్పగలిగిన శక్తి లేదు. కానీ ఇవన్నీ ఉన్నటువంటి వాడు మానవుడు. మానవుని కన్నా బుద్ధిని విశేషమైనటువంటి జ్ఞానాన్ని వినియోగించి తనలో ఉన్నటువంటి ఆత్మని తాను ఎరగాలి, తెలుసుకోవాలి. జంతు ప్రవృత్తితో ఉండకూడదు, పశు ప్రవృత్తితో ఉండకూడదు, పశుపతి తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని నిరంతరము డెబ్బై రెండు సంవత్సరాలు బోధ చేస్తూ ఇది ఇట్లా కాదు నాకు సేవకులు లేరు, నాకు పరిచారకులు లేరు, నాకు భక్తులు ఉన్న వారు ఉండనివ్వండి, నాకు శిష్యులు లేరు. మరి ఎవరున్నారయా అంటే సేవా స్వరూపమైనటువంటి సేవా తలాని నేను సృష్టిస్తానన్నారు. ఇక్కడ సేవా దళ సృష్టికర్త ఎవరు అంటే మళ్ళీ ప్రపంచ పటం మీద ఒక్క సత్య సాయి భగవానుడు మాత్రమే. అనేక NGO లు ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి, అనేకంగా డబ్బు పోగు చేసి దందాలు చేసి పనిచేసేవి ఉన్నాయి. కానీ సేవను ఒక organization అంటూ ఉంటే సత్య సాయి సేవా organization, సేవని organization, organized గా సేవ చేయాలి. ఎవరి కడుపు నింపాలో వాటి కడుపు నింపాలి. ఎవరి కన్నీళ్లు తుడవాలనో వాటి కన్నీళ్లు తుడవాలి. ఎవరికి అవ-- అభిష్టానున్నదో దాన్ని రూపు మార్చాలి. ఎవరి యందు అజ్ఞానము, అవిద్య, ప్రబల-- ప్రగల్భము, గర్వము ఇవన్నీ ఉన్నాయో అవన్నీ సంస్కరించాలి. ఇవన్నీ చేయాలి అంటే దీనికి సేవ తప్ప మరొక మార్గం లేదని వేదాలలో చెప్పబడిన ఒక శ్లోకం మీకు-- మీరు గుర్తుపెట్టుకో అక్కర్లేదు గానీ సారాంశం చెప్తాను. "ఏనకేన ప్రకారేణేష విశ్శాపితేహినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం" ఏదో మా-మన బోటి వాడికి శ్లోకాలు వచ్చు, పద్యాలు వచ్చు, పాటలు వచ్చు, హే భగవాన్ అనే సంస్కారం ఉండొచ్చు. మరి ఇది ఏమీ లేని వాడు ఏం చేయాలి అంటే ప్రతి వ్యక్తి తనకున్నటువంటి పద్యంతో తన చుట్టూ ఉన్నటువంటి వారికి గనక ఆనందం కలిగించగలిగినట్లయితే దాన్ని మించిన ఈశ్వర పూజ లేదు. అదే ఈశ్వర పూజ. "తత్ ఏవ ఈశ్వర పూజనం" మనం భగవంతుడు ఆ.. ఈశ్వరార్చన చేయాలంటే అర్చన కావాలి, ఆరాధన కావాలి, వేడుక కావాలి, జాతర కావాలి, ఊరేగింపు కావాలి అనేకా-- అనేకమైనటువంటివి కావాలి. ఇవేవీ అక్కర లేకుండా సేవ ద్వారా నువ్వు గనక ప్రపంచానికి దగ్గర కాగలిగితే ప్రపంచం మొత్తం నీ దగ్గరకు వస్తుంది. సత్య సాయి భగవానుడిని ఇన్ని దేశాలు, ఇన్ని ప్రపంచాలు ఇన్ని-- అన్నీ కూడా వీడు దైవమే అని ఎలా నిర్ణయించినాయి అంటే ఒకటే, ఆయన ప్రపంచాన్ని ప్రేమించారు నిస్వార్థంగా. కనుకనే ప్రపంచం మొత్తం ఆయన్ని నిరంతరంగా దేవుడంటూ ఉంటే అది ఒక్క బాబా గారు మాత్రమే అని నిరూపణ జరిగిపోయినటువంటి కాలంలో మనం పుట్టాం. ఇప్పటిదాకా స్వామి ఏం చేశారు? స్వామి యొక్క విశేషాలేంటి? ఇవన్నీ ఉన్నాం. వీటితో పాటుగా ఇంకొక విశేషం ఉంది. శ్రీరామకృష్ణ అవతారాలతో పాటుగా అనేకమైన దేవీదేవతల స్వరూపాలకి గాయత్రీ మంత్రాలు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చినటువంటి అవధూతలకు గానీ, జ్ఞానం అనిపించుకున్న వారికి గానీ, నేను కూడా దేవుడినే అని తిరిగిన వాడికి గానీ, కాదు కాదు ఆయన దేవుడని కనిపించుకున్న వాడికి గానీ గాయత్రీ మంత్రాలు లేవు. పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబరు ఇరవై నాలుగో తారీఖున స్వామి వైట్ ఫీల్డ్ లో ఉన్నారు అంటే బృందావనం బెగళూర్ లో ఉన్నారు. ఆరోజు ఒకాయన్ని పిలిచి నువ్వు కాసేపు మాట్లాడు అన్నారు. మాట్లాడటం ఆయన మొదలు పెట్టడానికి ఏదో మాట్లాడడానికి వచ్చారు ఆయన. కానీ మాట్లాడబడింది వేరు. "సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్" అని చదివేశారాయన. చదివి ఒకసారి భయపడిపోయారు. భయపడి స్వామి దగ్గరికి వెళ్లి స్వామి నేను రెండు పొరపాట్లు చేశానన్నారు. గాయత్రీ నా నోటి నుంచి తెప్పించి నన్ను ఋషిని చేసిచ్చారు. కానీ ఒక అపచారం జరిగింది. "సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి" బానే ఉంది "తన్నః సత్యః" అన్నాడి కదా, మీ పేరు సత్య స్వరూపం కదా, సత్య సాయిబాబా వారు కదా "తన్నః సర్వః" అన్నాను. అన్నప్పుడు ఆయన వేద పండితులు. స్వామి నెమ్మదిగా చూడు మహామంత్రాదుల గ్రంథంలో పెద్ద పుస్తకం చదివావా అన్నారు. ఆయన అసలు తప్పు చేశాననే భావంతో స్వామి దగ్గర కూర్చున్నారు. దానిలో పరమేశ్వరుడిని ఏమన్నారు?సర్వభ్యః సర్వ సర్వభ్యః సర్వః అంటే ఈశ్వరునిది అని అర్థం. నీవు చేసింది సత్యః అంటే ఇది దేహం, సత్యః అంటే ఇది భావం, సత్యః అంటే ఇది తత్వం. సర్వః అంటే నాద రూప భావ తత్వాదు అన్నీ కలిసింది గనుక తన్న సర్వః కరెక్ట్ అన్నారు. [చప్పట్లు] అది గాయత్రి చెప్పిన దానికి అర్థం కాలేదు. అప్పుడు ఇంకొక చిన్న పొరపాటు జరిగింది స్వామి. నేను అన్నీ గుళికలు లెక్కపెట్టుకున్నాను, బీజాక్షరాలు లెక్కపెట్టాను. మాములుగా గాయత్రికైనా నూట ఎనిమిది బీజాక్షరాలు ఉంటాయి. నూట ఎనిమిదికి బదులుగా సత్య సాయి గాయత్రిలో నూట తొమ్మిదవ ఏదో కనబడుతున్నది. అది ఎక్కడో నాకు కనబడటం లేదు కానీ ఉన్నది, వినిపిస్తూ ఉన్నది అన్నారు. అది ఏమిటంటే మిగతా గాయత్రులన్నీ సంప్రదాయ గాయత్రితో సహా ఏదైనా కావాలి అని కోరుకొని ఆయుష్షు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఋణభాధ నుంచి బయట పడవచ్చు, ఏదైనా కారణం పెట్టుకొని మీరు గనుక గాయత్రి చదవటం మొదలు పెడితే నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత నీ కోరిక నెమ్మదిగా సడలటం ప్రారంభిస్తుంది. ఏదనన్నా తీరుతుంది, కోరికన్నా మాయమైపోతుంది. కోరిక పోతే గాయత్రి లూప్ తలం అవుతాది కదా! కానీ దాని యందు అనుగ్రహం రావాలి అంటే నూట ఎనిమిది సార్లు చదవాలి. సత్య సాయి గాయత్రిలో నూట తొమ్మిదవ బీజాక్షరము మా అనుగ్రహమే. మీరు చదవాలి అని అనుకుంటుండగానే మీ పని పూర్తవుతుంది. [చప్పట్లు] కంఠ కన్న సర్వః ఇది గుర్తు పెట్టుకొని సాయి గాయత్రి మీరు ఎప్పుడైనా పరీక్ష పెట్టుకోండి. ఇవాళ ఇది జరగాలి స్వామి దయవల్ల అని గాయత్రి చదవండి. మీరు వెళ్ళే వరికి మీ పనులు పూర్తయి ఉంటాయి. అంటే ఇదంతా ఒక ప్రచారం కోసం చెప్పేది కాదు, జీవితానుభవంలో నుంచి చెప్పేది. వీటన్నింటిని అనుభవించి, అనుభూతి చెంది మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నట్లయితే ఏదో ఒక మహాత్ముడిని దర్శనం చేశాం, ఏదో చాలా గొప్ప వ్యక్తిని చూశాం కాదు. జన్మలో, దేహంలో, మూర్తిని ఉండగా ఒక అవతారమూర్తి జన్మ ఎత్తిన కాలంలో మనం కూడా జన్మ ఎత్తడం మన వల్ల, అయ్యేదేనా? మన వల్ల అయిందా? మనం ఎందుకు పుట్టాం అంటే కాలంలో పుట్టడం వారి సంకల్పం, పుట్టించుకున్న ఆయన సంకల్పం. ఎందుకని? ప్రపంచం మొత్తం అంతా వచ్చి ఆయనకి సేవ చేస్తుందంటే పురుషులందు పుణ్య పురుషులు చేరాలి. దానికి అర్హత కావాలి, ప్రాప్తి కావాలి, తపన కావాలి, తపస్సు కావాలి, మనసు తప్తం కావాలి. అది కాకి గాయి ఉండాలి, మాగి మాగి ఉండాలి. ఉన్నట్లయితే పరమాత్మ మనకి దగ్గరకు తీసుకుంటాడు. తీసుకొని ఊరికే కబుర్లు చెప్తాడా? ఊరికే ఇది చేయండి, అది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడా? తాను చేసిన తర్వాత ప్రపంచానికి బోధించాడు. మిగతా వాళ్ళంతా ఇది చేయండి, అది చేయండి అని చెప్పారు. ఏది చేయకూడదో చెప్పారు, ఏది చేయాలో చెప్పారు. స్వామి ఏది చేయాలో చేసి మీరంతా గ్రామాల్లో సేవ చేయండి అని వింటూ ఉన్నాం. వింటూ వింటూనే దశాబ్దాలు గడిచిపోయాయి. సేవ చేసిన వాడు లేడు. గ్రామ సేవ చేయండి అంటూ ప్రశాంతి నిలయం అనేటువంటి పుట్టపర్తి ఉన్నటువంటి గ్రామాన్ని తీర్చి దిద్దటంలో స్వామి వారు సాధించింది ఏంటంటే గ్రామ నిర్మాణాన్ని, పునర్వికాసాన్ని, దాని యొక్క పరిణామ స్థితిని, దానిని పరమాద్భుతంగా తీర్చిదిద్దటాన్ని తమ తాము ఉన్నటువంటి కాలంలోనే మనందరి కళ్ళ ముందు, ఇందాకే చెప్పాను ప్రతి పదేళ్ళకి ఒక్కొక్క మార్పు తెస్తూ ఇవాళ ప్రశాంతి నిలయం ప్రపంచంలో నిలబడి పోయిందో, దాని నిర్మాణం చేసినప్పుడు ఇది స్వామి మనకు చూపించిన గ్రామ పునర్ నిర్మాణ సంస్కరణ వేదిక. అంటే మీరు కూడా ఇలా చేయండి, నేను ఒక్కడినే చేయలేను. దైవ శక్తి వేరు, మానవ శక్తి వేరు. మానవులందరం కలవాలి, సంఘటితం కావాలి. ప్రపంచం యొక్క అవసరాలు గ్రహించాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సిరిసిల్లలో ఉన్న అవసరాలు సిద్ధిపేటలో ఉండకపోవచ్చు. సిద్ధిపేటలో ఉన్నది గజ్వేల్ లో ఉండకపోవచ్చు. గజ్వేల్ లో ఉన్నది ఇంకో చోట ఉండకపోవచ్చు. గ్రామానికి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నట్లయితే ప్రతి గ్రామము ఒక పుట్టపర్తి అయి తీరుతుంది. ప్రతి గ్రామము ఒక ప్రశాంతి నిలయం అయి తీరుతుంది. ఎప్పుడు అంటే భగవత్ శక్తిని కూడా మన శక్తికి జోడించినప్పుడు. ఒట్టి స్వామి అనుగ్రహం కలిగితే పని జరగదు. స్వామే చెప్పారు దైవపు ప్రజ్ఞ ఎప్పుడూ ఉన్నది కానీ జీవ ప్రజ్ఞ కూడా దాంట్లో కలవాలి. బంగారం కన్సెంట్రేట్ చేయించుకుంటాం దానికి అంతు ఉండాలి. అలాగే నువ్వేం చేశావు ఒక చొక్కా కుట్టించుకోవాలి, దేహం ఉండాలి. దేహం ఉండాలి దానికి చొక్కా ఉండాలి. దైవం ఉండాలి జీవుడు ఉండాలి. రెండూ కలిసి జనుడు, జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు భిన్నంగా లేవు. ఇవన్నీ ఒకటే. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే దానిలో నుంచి దైవాన్ని చూడొచ్చు. భగవన్నామ సంకీర్తనలలో నుంచి దైవం యొక్క స్వరవాన్ని, నాదాన్ని విన-వినవచ్చు. నేను మన మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు ఒక భజన, ఒకే ఒక భజన విన్నాను నేను. ఒక్క భజన ఎంత బాగున్నది అంటే నిజానికి మనం చేస్తున్న భజనలన్నీ కూడా పాలిష్ చేసుకొని రాగాళ్లు ఇమిడిపోయి దానికి స్వరాలు ఉండి అవి టెక్నికల్లీ సుపీరియర్ భజనలవి. కానీ ఇవాళ నేను విన్న భజన హృదం కణాలల్లోని బయటకు వచ్చి భగవంతుణ్ణి హరి హరి రామ స్మరణ చేసినప్పుడు నాకు ఆనందం చాలా కలిగింది. దానికి కారణం ఏమిటంటే సంగీతం తెలీదు, సాహిత్యం తెలీదు. భగవంతుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళటమే. ఏమున్నది దాంట్లో అంటే భగవంతుని యొక్క నామస్మరణే అత్యంతమమైనటువంటిది. కలియుగంలో నాస్తి నాస్తి కలౌ నాస్తి హరి నామ వినాగదిహి. కలియుగంలో ఏం చేయగలం, యాగం చేయగలం, పని చేయలేని కానీ చేయగలిగింది ఒకటుంది నామం చేయగలం. నామాన్ని రామా రామా అనుకుంటూ పని చేసుకుంటూ ఉందాం, పని చేద్దాం. పనికి పనికి విరామ కాలంలో నామస్మరణ చేద్దాం. అలాగే ఊరు నుంచి హైదరాబాద్ కి వెళ్ళాలి రెండు మూడు గంటల ప్రయాణం. ఒక్కళ్ళే వెళ్తున్నారు బస్సులోనో, ఒక ట్రైన్ లోనో పోనీ మీ కార్ లోనే వెళ్తున్నారు. ఒక్కరే వెళ్తున్నారు ఏం చేయాలి? ప్రపంచంలోచూసింది మాట్లాడుతుంటే భగవన్నామస్మరణ చేసుకోనికి వెళితే కొన్ని లక్షల కోట్ల నామ జపం అనుకోకుండానే జరిగిపోతుంది. దానివలన ప్రపంచం ఎంత బాగుంటుంది. ప్రపంచం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగున్నంత మాత్రాన ప్రపంచం బాగున్నట్టు లెక్క కాదు. ప్రపంచం బాగుంటే, ప్రపంచం ఆనందంగా ఉంటే దానిలో మనకు కూడా ఒక ఆనందం ఒక భాగం మనకు దొరుకుతుంది. కాబట్టి ఇవాళ మన కర్తవ్యం ఏమిటి? స్వామి చేసిన కార్యక్రమాలన్నీ చెప్పుకుంటూ ఒక అవతారం పరిసమాప్తమై పదకొండు సంవత్సరాలు పూర్తయిపోయింది. పన్నెండు. two thousand eleven నుంచి two thousand twenty three దాకా వచ్చేసాం. మళ్ళీ నవంబర్ కి వచ్చేసరికి ఇంకో ఏడాది పెంచుకుని ఇంకో ఆరు నెలలు. ఇవాళ ప్రశ్న ఏమిటంటే మనం ఏం చేయాలి? ఇది పెద్ద ప్రశ్న. రోజు స్వామి గురించి ఇలా కాసేపు మాట్లాడుకుని హాయిగా వెళ్ళిపోదామా? మా స్వామి దైవమే అని నిర్ణయం చేసుకుని వెళ్ళిపోదామా? మనమేమంటాం? ఆయన దైవమే. కాదు అనటానికి మన దగ్గర శక్తి లేదు. అవును అని చెప్పటానికి అసలే శక్తి లేదు. మరి ఏం చేయాలంటే అంగీకరించి ముందుకు వెళ్ళిపోదాం. ఎలా వెళ్ళాలి? మనకి అందరికి కుటుంబాలున్నాయి. భార్య, భర్త, బిడ్డ, ఒక స్నేహితుడు, ఒక కొడుకు వాళ్ళు, ఒక బంధువు, ఒక అన్న, ఇది మన చిన్న unit. అనుకున్నట్లయితే మనం ఒక్కళ్ళమే ప్రశాంత కళ్యాణానికి వెళ్ళిపోయి బాగుపడటం అనేది లేదు. మన కుటుంబం మొత్తము అక్కడికి వెళ్ళాలి. భవనంలోకి రావాలి. ఇవాళ ఇక్కడ ఇంత అందమైన మందిరం కట్టుకున్నాం. చాలా అందమైన మందిరం. ప్రశాంతంగా, విశాలంగా, చల్లటి పైన గాలి, గ్రామ గాలి ఇవన్నీ వీస్తున్నాయి. pollution లేదు. oxygen సుమారు eighty five percent ఉన్నటువంటి oxygen ఉన్న గాలి వస్తోంది. దీనికి ఎప్పుడో ఒకసారి మందిరానికి వచ్చేకంటే రోజు మనం భోంచేస్తున్నాం, రోజు నిద్రపోతున్నాం, రోజు మనకు అక్కరలేని విషయాలన్నీ TV లో వింటూనే ఉన్నాం. జరుగుతున్న వాటికి, చూపబడుతున్నదానికి మనకెట్టి సంబంధం లేదు. వాళ్ళెవరో, వాళ్ళెవరో, వాళ్ళ జీవితాలేవి. మనకు సంబంధమే లేని వాటి గురించి ఇరవై నాలుగు గంటలు చూస్తున్నాం. కదా. దాని బదులు ఇరవై నాలుగు గంటలలో ప్రతి రోజు, ఇదేం పెద్ద city కాదు, పెద్ద నగరం కాదు. ఊర్లో ఉన్నటువంటి వాళ్ళం. ప్రతి రోజు ఒక గంట స్వామి మందిరానికి వెళ్ళి ఇక్కడ ఏం చేయొద్దు. నామం చేసుకునేవాళ్ళు నామం చేస్తారు. ధ్యానంలో ఉండేవాళ్ళు ధ్యానంలో ఉంటారు. ధ్యానం అనే పెద్ద పేరుకు బదులు మౌనంగా ఉంటారు. కనీసం ఏం మాట్లాడకుండా అన్నా ఉంటారు. అనుభూతిని పొందటానికి మందిరాన్ని మనం వాడుకోవటం నేర్చుకోవాలి. ఇది మొట్టమొదట. ఇదేదో పర్వదినం ఏడాదికోసారి, నెలకోసారి ఇలా రాకూడదు. ప్రతి రోజు రావటానికి ఏది అడ్డుపడుతుందంటే TV serials అడ్డుపడుతుంది. లేదా ఏడు గంటలకి debate అడ్డుపడుతుందని. వాటి గురించి medium medium లో ఒక్క మంచి మాట, హృదయానికి ఆనందం కలిగించే మాట ఒక్కటి లేదే. చూసినప్పుడు జాతి ఏమైపోతుందనే నిరువేదం కలుగుతుంది. ఇటువంటి ఒక అవతారమూర్తి వచ్చినటువంటి కాలంలో పుట్టిన మనం, ఒక అవతారమూర్తి శ్రీకృష్ణుడు బాల్యంలో చేసిన క్రీడలన్నీ మనం వింటూ ఉన్నప్పుడు భాగవతాన్ని కళ్ళకు అద్దుకున్నామే. కానీ మన కళ్ళముందే ఒక గ్రామాన్ని ఒక అద్భుతమైన స్థాయికి తీసుకువెళ్లి, మానవుడికి నాగరికత నేర్పి, సమస్త మానవులు ఒకటేనని, సమస్త దేశాలు ఒకటేనని, ప్రపంచానికి కాలంలో శాంతి ప్రేమలు కావాలని, దానికి సేవ మాత్రమే మార్గమని చెప్పి తాను నిరూపించి ఉన్నటువంటి ఒక అవతారమూర్తితో కూడి ఉన్నటువంటి మనం రకమైన పని లేకుండా నిస్సత్తువుగా మన కాలహరణం చేసుకున్నట్లయితే ఏమైపోతుందంటే కాలం మనల్ని ముందుకు నెట్టేస్తుంది. అయ్యో ఆనాడు అలా చేయకుండా ఉండవలసింది అని అనుకునే బదులు ఆనాడు అలా చేయబట్టి ఈనాడు ఇంత హాయిగా ఉండగలిగాం అనే stage కి రావాలంటే ప్రశాంతత నాలుగు రోడ్ల కూడలిలో దొరకదు. దొరుకుతుందా? bus stand కి వెళ్ళినా దొరుకుతుందా? సినిమా hall కి వెళ్ళినా దొరుకుతుందా? ఇక్కడికి రావటానికి కాస్ట్ ఖర్చు ఉందా? ఎక్కడన్నా ticket లు ఉన్నాయా? ఇది మనదిగా భావించి గనుక ఇక్కడికి వచ్చినట్లయితే మన పిల్లలు వచ్చి బాల వికాస్ లో అయినా కూర్చున్నట్లయితే వాళ్ళకి ఇప్పట్నుంచే నెమ్మది నెమ్మదిగా అనేక శ్లోకాలు, అనేక పద్యాలు, పెద్దలు చెప్పేటువంటి మాటలు, బాల వికాస్ గురువులు చెప్పేవి. చేతులోలించ శివుని పూజింపడేని, నోన్-నొమంగ హరి కీర్తి నునువడేని, దయయు సత్యంబు లోలుగా తలపడేని, కడునేటికి తల్లుల కడుపు చేటు. భగవత్ పద్యము. అలాగే నీ పాదకముల సేవయు, నీ పాదాక్షములతోడి నెయ్యం, నిదాంత అపార భూత దయు, ఆపసముందారా నాకు దయసేయగదు. భగవంతుడిని మనం ఇంత అనాలి. మనకి రోగం పోగొట్టింటే రోగం పోతే ఇంకో రోగం వస్తుంది. అంతేనా? రోగం పో- శరీరం అంటేనే పెద్ద రోగం. దాంట్లో చిన్న చిన్న రోగాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వాటికి మందులు ఉన్నాయి. కానీ జన్మని సార్థకం చేసుకుని మళ్ళీ మనుజన్మే అక్కరలేని ఒక స్థితిలో, ప్రపంచం అనేటువంటి మహాయజ్ఞంలో మనం కూడా ఒక అర్హమైన సమిధగా మారాలి అంటే భగవన్నామ సంకీర్తన తరిమిండు. అది మనం చేయాలి. మాట్లాడకుండా ఉండాలి. మా보 like వాళ్ళ నేను ప్రధానంగా మాట్లాడాలి అని గనుక గంటో అరగంటో మాట్లాడుతాం. తర్వాత ఏం చేస్తాను నేను? ఇలానే మాట్లాడుతూ ఉంటానా? కాదు కదా. తర్వాత మౌనం వహించాలి. మౌనంలో నుంచి చైతన్యాన్ని తెచ్చుకోవాలి. అలాగే ప్రపంచం మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. మనం అప్పుడే సేవ గురించి, ధర్మం గురించి ఉపన్యాసం ఇస్తాం. ఒక ఆకలి ఉన్నవాడికి ఆకలి తీర్చు అని చెప్తాం. కానీ ఆకలితో నక్కని కన్నాడుతున్నవాడు ఒక గుడ్డివాడు. వాడు మీదిగా మన కార్ వెళ్తుంది. వాడి కోసం మనం ఆగం. ఎందుకంటే మనం వెళ్ళవలసిన పని వేరే ఉంది. దానికంటే వీడు ముఖ్యం కాదు. కానీ జరగవలసింది ఏమిటో తెలుసునా? వాడి ఆకలి తీర్చటం మన బాధ్యత. వాడి ఆకలికి ఒక bun, ఒక tea ఇచ్చేస్తే తీరిపోతుంది. శరీరం ఇరవై ఒక్క రోజులు నిలబడుతుంది.కానీ మనం టీ తాగుతాం, మళ్ళీ టీ తాగుతాం, మళ్ళీ మళ్ళీ టీ తాగుతాం. ప్రయోజనం ఉన్నదా? లేదు. అలాగే మనకి వార్డ్ రోబ్స్ ఉంటాయి. అంటే బట్టలు పెట్టుకునే ప్లేస్. ప్రతి పండగకి రెండు రెండు బట్టలు కొనుక్కుంటాం. రెండు జతలు అనుకోండి. అలా సంవత్సరం అయ్యేప్పటికి ఇరవై నాలుగు, ముప్పై జతలు వస్తాయి. రోడ్డు మీద చిరిగిపోయిన బట్టలు కట్టుకొని చదువుకోవడానికి అవకాశం లేక, తలకి కొబ్బరి నూనె రాసుకునేవాడు కూడా దొరికే అవకాశం లేని టైములో వాళ్ళందరినీ చూసినప్పుడు వీటిని మనం చేయగలిగిన చిన్న సేవని ఒక యజ్ఞంగా భావించగలిగినట్లయితే ఇది నిజమైనటువంటి కాలానికి కావలసిన సేవ. కాబట్టి ఇవాళ మనం ఆలోచించవలసింది ఏమిటంటే స్వామిని ఒక రోల్ మోడల్ గా మనం భావించినట్లయితే భావనలో నుంచి మనం నెమ్మదిగా సమాజంలో వినటం మాత్రమే కాదు, చేయటం మొదలు పెట్టాలి. చేయటం మనకి అనేక బట్టలు ఉంటాయి. అసలే బట్టలు లేని వాడికోసం ఒక్క పండుగైనా మనం ఆపుదాం. పండుగకి ఒక నాలుగొందల రూపాయలు సేవ్ చేశామనుకోండి. లేదు నెలకు ఒక వంద రూపాయలు ఒక డబ్బాలో పడేశామనుకోండి. సంవత్సరం అయ్యేప్పటికి పన్నెండు వందల రూపాయలు. అలాగే మనమందరం ఇక్కడ వంద, రెండు వందల మంది ఉన్నామనుకోండి. రెండు వందలు ఇంటూ పన్నెండు వందలు. చాలా డబ్బు. నారాయణ స్వామి జయంతం, చదువుకునే వాళ్ళకి ఫీజు కడదాం, ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బట్టలు కుట్టిద్దాం. వాళ్ళకి ఒకేషనల్ గా చక్కగా కుట్టు పనులు ఏపుదాం. గృహిణులంతా నట్ట తెచ్చేటువంటి డబ్బు కోసం ఎదురు చూసే కంటే తాము కూడా స్వయంగా, గవర్నమెంట్ ని వదిలేయండి. అది చేయదు, చేయలేదు, చేయాలి అంటే చాలా కావాలి. అవన్నీ అక్కరలేకుండా మనంతట మనమే చేసుకునేటువంటి వృత్తి నిత్యం కూడా మనం గనక చేసుకోగలిగితే ఇవాళ మందిరాలు కేవలం భజనకు మాత్రమే కాదు, ఇవి నాలెడ్జ్ సెంటర్స్ గా ఉండాలి. పిల్లలందరికీ చిన్నప్పుడే భజనలు, పాటలు, రాముడు, భీముడు అన్నీ చెప్పాలి. ఇవన్నీ జరగాలని అలాగే స్వామిని ఒక రోల్ మోడల్ గా పెట్టుకొని జీవితంలో రకమైనటువంటి విషయాన్ని కావాలని కోరుకోకుండా, దీనికి కారణం ఏంటంటే చెప్తాను. యోగవాసిష్ఠంలో వశిష్ఠులవారు రాముడితో ఒక మాటంటారు. దాని పేరు "లోకే విహన రాఘవ". నాయనా రాఘవ అంటే రామ, లోకంలో నువ్విలా ఉండాలయ్యా అని చెప్పాడు. చాలా చెప్పాడు. అందులో ప్రధానమైనవి పది చెప్పాడు. పదిలో ఒకటి అత్యంత ప్రధానమైనది. అదేమిటంటే, కాలగమనంలో నువ్వు రాజ్యానికి రాజువు అవుతావు. రాజువి అయిన తర్వాత నీ దగ్గరికి చాలా మంది రోజు వస్తుంటారు. ఎందుకొస్తారో తెలుసా? పాపం అది కావాలి, ఇది కావాలి, నువ్వే చేయగలవు, రామా! నువ్వే మాకు తీర్పు అంటూ వస్తారు. వాళ్ళందరినీ రా నీవు. వాళ్ళందరినీ నువ్వు విను. కానీ కోరికలలో అందరినీ రానీ, అందరి కోరికలు నువ్వు తీర్చు. కానీ నువ్వు ఒక్కడివి మాత్రం కోరికలు లేనివాడివే జీవించు. నీక్కుడా కోరికలున్నాయనుకో, నీకు తీర్చబడేవాడు లేడు. ప్రపంచంలో కోరికలన్నీ నువ్వు తీరుస్తూ వెళ్ళిపో. కానీ కోరిక లేనివాడివై యుండు అన్నటువంటి నాటి సాకేత రాముడే నేటి సత్య సాయి రామ్. [అందరూ ఒకేసారి] [చప్పట్లు] ఏం వినలేదు. ఆయనకు ఏం కొరుతుంది? మనకి తెలుసు ఉంగరాలు ఇచ్చారు, మొగరాళ్ళు ఇచ్చారు, గొలుసులు ఇచ్చారు ఇవన్నీ విన్నాం. కానీ నేనైతే చూశాను. కానీ ఆయన చెంతకు ఉంగరాలు ఎప్పుడన్నా చూశారా? ఆయన మెడలో గొలుసు ఎప్పుడన్నా చూశారా? కంటికి కళ్ళజోడు చూశారా? మెడలో గ-గొలుసులు చూశారా? కాళ్ళకి చెప్పులు చూశారా? ఏమీ లేవు. ఎందుకని అంటే ఆయనకు అక్కర్లేదు గనుక. ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్తాను. ఇది మనందరికీ నాతో సహా నేర్చుకోవాల్సింది ఏమిటంటే స్వామి ఒక పుట్టు పండుగ నుంచి రెండవ పుట్టు పండుగ వరకు కేవలం ఆరు జతల బట్టలతో ఉండేవారు. ఆరు జతలు. అవే చంద్రాబాబుకి వెళ్ళాలి, చాకలి ఉతకాలి, సలువ చేయాలి, తెచ్చి ఇవ్వాలి. స్వామే గనక తలుచుకుంటే గంట గంటకి డ్రెస్ మార్చుకోవచ్చు. మార్చరు. మళ్ళీ ఏదో డ్రెస్ లేనే లేదు. నలభై, అరవై ఏళ్ళు ఒకే పెన్నుతో ఆయన రాస్తున్నారు. ఒకే ఒక్క పెన్ను రెండోది లేదు. ఎన్ని గిఫ్టులు కానీ అన్నీ పిల్లలకి ఇచ్చేశారు. మీరు రాసుకోండి అన్నారు. దానికి చిన్నప్పుడు నలభై, అరవై ఏళ్ళ క్రితం వచ్చిన ఒక పెన్ను ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మీద ఉంది. ఇవన్నీ గమనిస్తే ఏమనుకుంటున్నారంటే మనము మన కోరికలని అదుపులో పెట్టుకోవాలి. అదుపు తప్పుతున్నాం మనం. ఒక చిన్న మారుతి కారు ఉంటే కాదంటున్నాం. కొనిన తర్వాత ఒక స్వర్ణ గనక ఇంకేదో హాల్ అయిపోయింది. అదే పోయాక ఇంకోటి, ఇంకోటి. డబ్బు సురులు సుఖాలు పెరుగుతున్నాయి. సంతోషాలు కలుగుతున్నాయి. సుఖ సంతోషాలు జమిలిగా వెళ్తున్నాయేమో ఆనందం అంటే అర్థం కాలేని స్థితికి వచ్చింది. స్వామి ఒకనాడు ఒక మాట చెప్పారు. మీకు ఆనందం అంటే ఏమిటో తెలీదు. నాకు దుఃఖం అంటే ఏమిటో తెలీదు అన్నారు. [చప్పట్లు] అది దుఃఖం అంటే ఏమిటి? అది ఏమిటో దాని స్వరూపం ఏమిటన్నారు. ఎందుకంటే ఏదీ అక్కర్లేదని మన మనసుకు మనం చెప్పుకోగలుగుతామో, చెప్పుకున్నట్లుగా జీవించగలుగుతామో కోరిక లేదు, కోరిక వల్ల దుఃఖం లేదు, దుఃఖం వల్ల యాతన లేదు, యాతన వల్ల ప్రమాదం లేదు, ప్రమాదం వలన ప్రాణానికి రకమైన యాతన లేదు. ఇది కావాలి అని గట్టిగా అనుకుంటే అది కోరిక అయితే ఇది వద్దు అనుకుంటూ గనక మొదలు పెడితే మనకు ఏం కావాలో భగవంతుడు ఇస్తాడు. ఇచ్చినదే మనదిగా భావించాలి. ఉన్నదాంట్లో ఉండాలి. తృప్తిగా ఉండాలి. మనది చిన్న బాతు రెక్కలు, ఆకాశం దాకా ఎగరలేవు. అది కావాలంటే గరుత్మంతులం కావాలి. శక్తివంతమైనటువంటి రెండు రెక్కలు కావాలి. రెండు రెక్కలు ఒక అవతారంలో శిరిడి బాబా శ్రద్ధ, సబూరి అని రెండు చెప్పారు. అవి రెండు రెక్కలు. సత్య సాయి అవతారంలో దానితో పాటుగా లవ్ అండ్ సర్వీస్. ప్రేమ, సేవ. రెండు అంటే నాలుగు రెక్కలైనాయి. నాలుగు రెక్కలు మనకిస్తే మనం ఇంకా వెనకబడిపోతూ ఎగరలేం.కానీ ఎందుకు కలిపించుకోవాలి ఆనందంగా ఉండవచ్చు కదా అనేటువంటి వైరాగ్య ఆనంద విభూతిని ప్రపంచానికి స్వామి నిరూపణ చేస్తూ మన దగ్గరికి మన మధ్య మరలా అయినటువంటి సత్యసాయి భగవానుడు. ఇవాళ ప్రపంచంలో ఒక survey జరిగింది. surveyలో స్వామికి ఎంతమంది భక్తులు ఉండి ఉంటారు అని. ప్రపంచం మొత్తాన్ని ఒక లెక్క వేస్తే ముప్పై తొమ్మిది కోట్ల మంది స్వామి భక్తులు ఉన్నారు. అందులో చాలామంది స్వామిని చూడని వాళ్ళు ఉన్నారు. ఇవాళ రెండువేల పదకొండు తర్వాత పుట్టిన వాళ్ళకి స్వామి సశరీరంగా చూసేయో అర్హత లేకపోయింది, ప్రాప్తి లేకపోయింది. కానీ ఇవాళ నిజానికి ఎంతమంది స్వామి భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే స్వామిని చూడని వారు ఎక్కువమంది వస్తున్నారు. ప్రశాంత నిలయం కూడా. అంటే ఇక్కడ స్వామి దేహంతో ఉన్నారా లేదా కాదు, స్వామి యొక్క చైతన్యం స్వామి ప్రపంచానికి చేసిన సేవ, ప్రపంచానికి నేర్పిన శుద్ధులు, బుద్ధులు, ఇవన్నీ కూడా పాఠాలు వీటన్నింటి వలన మానవ జీవితాలు ప్రభావితమై ఇక్కడిదాకా వస్తున్నాయి గనుక ఇవాళ మనకి ఒక కమీనరు, ఒక President ఇట్లా ఒక post మనకిస్తారు. ఒక కమీనరుగా కావాలన మనం నియమించుకుంటాం. కమీనరుగా ఎవరు అంటే కన్వీన్ చేయగలిగిన వాడు కమీనరు అంటారు. కన్వీన్ చేయాలి. కన్వీన్ చేయాలి అంటే భారత రాష్ట్రపతి కూడా ఐదు సంవత్సరాలే. మళ్ళీగా ఎవరినైనా ఎన్నుకుంటే అవుతాడు లేకపోతే కాదు. Chief Minister కూడా జనం ఎన్నుకుంటే ఆరు ఏళ్ళు ఉంటాడో ఉండడో తెలియదు. కాబట్టి ఇవన్నీ మనకివ్వబడిన పదవులన్నీ కూడా మనకి అశాశ్వతమైనటువంటి పదవి. కాలానికి లోబడినటువంటి పదవి. ఎవరైనా జీవితకాలం నేను ఒక అధ్యక్షుడిని అంటే అసలు భారత రాజ్యాంగంలోనే లేదు. అసలు స్వామి యొక్క భగవంతుని సామ్రాజ్యంలో అసలే లేదు. మరి ఎవరు అంటే కమీనరుగా ఇంతకాలం చేసినటువంటి వ్యక్తి అయినా, అది మందిరమైనా, society అయినా గాని కండి, రాష్ట్రం అన్నా గాని కండి, district అన్నా గాని కండి మనతో పాటు ఇంకొక leader ని తయారు చేయాలి. మనము మన కడుపున పుట్టిన బిడ్డని నా అంతటి వాడు కావాలంటున్నాం. భగవంతుడు భక్తుడిని చూసి వీడు నా అంతటి వాడు కావాలి అనుకున్నాం. నిజమైనటువంటి గురువు శిష్యుడు నన్ను దాటి వెళ్ళాలి అనుకున్నాం. కానీ నన్ను వెనక అవకాశం ఇవ్వక పోతే నాయకత్వం పుట్టదు. అలాగే మనకి భగవంతుడు ఒక నాలుగేళ్లో, ఐదేళ్లో, మూడేళ్లో, రెండేళ్లో అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన కాలాన్ని twenty four by seven అంటాం కదా, ఇరవై నాలుగు గంటలు దాన్ని ఎందుకు గనక చేయగలిగితే, చేసి అలా ఉండగలిగితే అద్భుతాలు సాధించవచ్చు. స్వామి మాట చెప్పారు. పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో చిన్న debate ఉండేది. వీడు పాత devote, వీడు కొత్త devote అనేటటువంటి మాటలుండేవి. పాత devote లంతా కొత్త devote వెనక్కి కూర్చోబెట్టేవాళ్ళు. స్వామి ఏం చేసినారంటే పాత devote లు మనందరికీ స్వామికి తెలుసు, స్వామికి మనం తెలుసు, మనం కూడా స్వామికి తెలుసు అని వాళ్ళంతా front row లో కూర్చునేవాళ్ళు. స్వామి Last row కి వెళ్ళారు. వెళ్ళా కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడేవారు. ఎందుకంటే స్వామి ఉపన్యాసంలో చెప్పారు. పెద్ద మహాసముద్రం ఉంది. సముద్రంలో ఒక గండశిల్పం ఉంది. దానిమీద నీళ్ళు అలలు కెరటాలు ఎగిరెగిరిగా రాయి మీద పడుతున్నాయి గండశిల్పం మీద. మళ్ళీ జారి మళ్ళీ సముద్రంలోకి వెళ్తున్నాయి. ఇంతలోకే సూర్యుడు వచ్చాడో, గాలి వీచిందో పడిన మరుక్షణం ఆవిరైపోయి మళ్ళీ dry అయిపోతుంది. కానీ అక్కడెక్కడో చిన్న మట్టి బిడ్డ గాలి కొట్టింది. కొడితే గాలికి మట్టి బిడ్డ దొర్లుతూ దొర్లుతూ వెళ్ళి నీళ్ళల్లో పడ్డది. పడిందో లేదో సముద్రం అయిపోయింది. కొత్త devotees అంతా మట్టి బిడ్డల వంటివారు. భగవంతుణ్ణి చూస్తూ ఉండగానే, దర్శించగానే, మాట్లాడగానే, తలచుకోగానే ఏమవుతున్నారంటే వాళ్ళు భగవంతుడు అయిపోతున్నారు. దాంట్లో భాగమైపోతున్నారు. పాత devotees అంతా గండశిల్పుల వలే ఉన్నారు. తడుస్తున్నారు, ఆరుతున్నారు, తడుస్తున్నారు. సముద్రం ఎంతకాలం ఉంటుందో senior devotees కూడా అలాగే ఉంటారు. కనుక మనం ఏం చేయాలంటే తెలీదు Nothing called senior. senior అనే మాట లేదు. See from near. దగ్గరగా భగవంతుణ్ణి ఎవరు చూస్తాడో వాడు senior. junior అంటే పశువులు మనం ఒక zoo కి వెళ్తాం. zoo కి వెళ్ళినప్పుడు సింహాలు అన్నీ కూడా బోనులో పెడతారు. మనం బోనులో ఉన్న సింహాన్ని చూసి మనం ఆనందపడిపోతాం. బోను ఎత్తితే తలుపు ఎత్తితే ఆనందం హరించి ప్రాణభయం కలుగుతుంది. కాబట్టి zoo గా పశువుగా ఉన్నట్లుగా కాకుండా భగవంతుణ్ణి దగ్గరగా చూస్తూ చూస్తూ, మాటలు వింటూ వింటూ తాను అదైపోతే వాడు junior అవుతాడు. వాడిని రానివ్వండి అన్నారు స్వామి. అందువల్లనే తర్వాత కాలంలో ఆయన్ని senior devote అనడానికి భయపడిపోయినారు అందరూ. నేను చాలా కాలంగా ఉన్నానన్నవాడు ఇక చాలు కొత్త వాళ్ళెవరైనా తీసుకొస్తాను అంటున్నాడు. వాడే తెచ్చి వాడికి పదవి ఇచ్చిన ఆయన నేను ఇలా బాగుపడ్డాను. దీనివల్ల నాకు హాయిగా ఉంది. నేను స్వామిని చూడగలిగాను. ప్రశాంత నిలయం వెళ్ళగలిగాను. మందిరానికి వచ్చిన దాని వల్ల నాకెన్ని లాభాలు కలిగినాయి. నువ్వు కూడా రా అని తీసుకొచ్చాడు. అందుకని ఇవాళ మనం దేవుణ్ణి చూడటానికి మనం వెళ్ళటం మాత్రమే కాదు. ఎప్పుడైనా దేవుణ్ణి మనం చూసిన తర్వాత దేవుని యందు మనకి ప్రీతి కలిగిన తర్వాత అక్కడిదాకా వెళ్ళలేని వాణ్ణి మనం గనక వెంబడి పెట్టుకొని వాడికి భగవంతుణ్ణి చూపించగలిగితే అది వేయి యజ్ఞాలతో సమానం. దాని ఖరీదు ఒక టికెట్టు ఖరీదు మాత్రం. ఇటువంటివన్నీ కూడా స్వామి మనకు నేర్పారు. వీటన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. ఇది ఏదో ఒకరోజు ఒక గంట మాట్లాడి వెళ్ళేది కాదు. ఇలా మనం మాట్లాడుకుంటూ ఎన్నెన్ని విషయాల్లో తాత్వికమైన విషయాలు మాట్లాడాం. చాలా గంభీరమైన విషయాలు, వేరే వేరే విషయాలు మాట్లాడదాం. మీరందరూ కూడా కొత్తవారుంటారు, పాతవారుంటారు. ఇక్కడ seniors ఉంటారు. అహంబుదిని పెడదాం. juniors ఉంటారు. వాళ్ళందరినీ ముందుకు ఉంచోపెడదాం. అలాగే ఒక పదవిలోనే కాలాలు ఉన్నాం. leadership తయారు చేద్దాం. నందరినీ వాణ్ణి తయారుచేసేవారికి బాధ్యతను అప్పగిద్దాం. ఒక President ఎప్పుడూ అనుకోవాలి స్వామి చెప్పిన మాటే President అంటే అధికారం చలాయించేవాడు కాదు అందరితో పాటు resident గా ఎవరు ఉండగలరో వాడే President అని చెప్పారు స్వామి. అంటే resident అంటే కలిసి ఉండాలి, కలుపుకొని ఉండాలి. అందరినీ సమన్వయం చేసుకోవాలి. స్వామి ఒక ప్రణాళిక ఇస్తారు సత్య సాయి సేవా Organization లో ఒక Protocol ఉంటుంది, Procedure ఉంటుంది. పద్ధతి ప్రకారం మీరు వెళ్ళండి అని అక్కడ చాలామందిని కూర్చొని కొన్ని ఎన్నయాలు చేసి మనకు ఇస్తారు. మన బాధ్యత ఏంటంటే మనకున్న పరిధిలో వాటిని చేసుకుంటూ వెళ్ళటం. ఎక్కడ భుజం నొప్పి పుట్టేలాగా మోయమని స్వామి చెప్పలా. నీకు తోచిన రీతి, నీవు చేయగలిగినట్లుగా, చేయగలిగినంతగా Two percent దానం చేయమన్నారు. Two percent సేవకు పెట్టుకోమన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ నై-నైతిక, భౌతిక, లౌకిక, ఆధ్యాత్మికమైనటువంటి అనేక విషయాలన్నీ కూడా మనం గమనించుకుంటూ వాటిలో మనల్ని మనం శుభ్రపరుచుకుంటూ ఒక నది ఎక్కడో ఒక చిన్న నీటి బిందువుగా పుడుతుంది. ఎక్కడ పుట్టిందో తెలియదు నది పుట్టుక. నెమ్మది నెమ్మదిగా పల్లములకు వస్తూ వస్తూ అది ఏం చేస్తాయంటే తాను శుభ్రపరుచుకుంటుంది. తన దారిని కూడా శుభ్రపరుస్తుంది. చివరికి ఏమవుతుంది? ఎక్కడో పర్వతం దొరికింది ఎగిసి ఎగిసి పడింది, వేగంగా నడిచింది, వేగంగా పారింది, ఆబి ఆబి, చూసి చూసి, పొరలి పొరలి వెళ్ళినటువంటిది సాగర సంగమం వేళ నిశ్శబ్దంగా సముద్రంలో కలిసిపోతుంది. అలాగే మన జీవన ప్రవాహం గనుక ఒక నదీ ప్రవాహం అయినట్లయితే మనం కూడా జీవితాన్ని శుభ్రపరుస్తూ మన దారంతా పరిశుభ్రం చేసుకుంటూ పరమేశ్వరుడు అనేటువంటి ఒక పరమాత్మతో అదే ఆత్మతో మనతో మనం లీనం కావడమే జీవితం యొక్క పరమార్థం. దాని పేరు మోక్షం. మోక్షం అంటే మనం మరణించిన తర్వాత ఇంకెక్కడో వెళ్ళి ఉండేది కాదు ఇక్కడే, ఇప్పుడే శరీరంలో ఉండగానే ఇవన్నీ చక్కగా అర్థం చేసుకుని ముందు వాతావరణాన్ని కాపాడుకుంటూ అందరితో సఖ్యంగా, ప్రేమగా, అనునయంగా, వాలెంటయంతో, మాద్రవంతో ఉంటూ అలాగే మనకున్నటువంటి జ్ఞాన విజ్ఞాన సంపదలన్నింటినీ కూడా ప్రపంచానికి చక్కగా ఇచ్చుకుంటూ నిరంతరమైనటువంటి తృప్తితో మనం గనక జీవించగలిగితే దానిని మించినటువంటి మోక్షం లేదు. మోహక్షయమే మోక్షం. ఇది మనం చక్కగా గమనిస్తూనే ఉండాలి. ఉన్నతమైనటువంటి అనేక తత్వాలు ఉంటాయి, అనేక మతాలు ఉంటాయి, జాతులు ఉంటాయి, అవి లేకుంటే ఎలా ఉంటాయి? ప్రపంచం అనేకం కానీ దాని మూలం ఏకం. ఏకం అనేకంగా కనిపిస్తున్నది. అనేకం మొత్తం కూడా అంతా ఒక్కటే. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మమే. కనిపిస్తున్నదంతా సాయి తనమే. స్వామి అన్నారు సాయిలో రాయిని చూడకండి, రాత్రిలో సాయిని చూడటం నేర్చుకోండి మీకు అన్ని చోట్లా ఆనందం కలుగుతుంది అనేటువంటి భావాలన్నీ కొన్ని లక్షల అనంత భావాలు మనసు నిండా పలుచుకున్నటువంటి వేళ హృదయం ఆనంద తరంగితమై ఉన్నటువంటి వేళ సిరిసిల్ల చాలా కుగ్రామం అని వెనకబడింది అని ఒకనాడు పేపర్లలో చదివి అట్లాగే ఉంటుంది అని అనుకుంటూ నగర ప్రవేశం చేసినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం ప్రాంతం మీద ఉన్నది కనుకనే దీనికి కావాల్సిన వ్యక్తులు ఏర్పడుతున్నారు. అందువల్లనే ఇటువంటి సాధన చేయటానికే డాక్టర్ గారి స్థలంలో మందిరం నిర్మాణం జరిగింది. ఇది జరగటానికి ఎవరికోసం? వారి కోసమేంటి చిన్న పూజలు ఉంటే చాలు. మందిరం ఎందుకు కట్టాలంటే తన కోసమే అనుకున్నట్లయితే పూజా మందిరం అయి ఉండేది. ఇది ప్రపంచానికి అంటే ఇది ప్రపంచానికి కావాల్సిన పెద్ద పూజా మందిరమేదే, ధ్యాన మందిరమేదే, Auditorium ఇదే, విద్యా వేదిక ఇదే, ధ్యాన వేదిక ఇదే. ఇది ఖాళీగా ఉంటూ మనకు పట్టలేదని ఇక్కడ స్వామి చిరంజీవిగా, స్థిరంగా, సంస్థితంగా అన్ని కాలాలయందు కాలం మాత్రమే కాదు రాబోయే అనేక కాలాల వరకు కూడా స్వామి ఇక్కడ సుప్రతిష్టుడై ఉన్నాడని అలాగే ఎక్కడ భగవాన్ నామ కీర్తన జరుగుతుందో, ఎక్కడ భగవంతుని యొక్క దివ్య నామం వినపడుతుందో, ఎక్కడ నా రూప, భావ, నామ, తత్వాలని అనబడుతాయో వారందరికీ ఒక్క తలాని మాత్రమే కాక వారి రాబోయే ఇరవై ఒక్క తరాలను నేను కాచుకుంటాను, నేను చూసుకుంటాను అన్నది భగవాన్ శ్రీ సత్య సాయిబాబా మాట. కాబట్టి ఈవేళ మనం చేసే పుణ్యం, మనం చేసుకునే తపస్సు, మనం చేసుకునేటువంటి స్వాధ్యాయం ఇదంతా కేవలం మనం ఎంతకాలం ఉంటాం maximum పందొమ్మిది. లోగానే కొడుకులు పుడతారు, పెద్దవాడవుతారు, మనవళ్ళు పుడతారు, ముని మనవళ్ళు పుడతారు. కానీ ముని మనవళ్ళు వచ్చే time కి మనం లేము అనుకోండి. కానీ ముని మనవడు ఏమంటాడో తెలుసా? నేను సాయిబాబాని చూడలేదు కానీ నా పాత ముత్తాతలు సత్యసాయిని చూశారు. వారి అనుగ్రహాన్ని పొందాము అంటే ఇరవై ఒక్క తరాలు రక్షింపబడటానికి మనం పూజ చేసుకోవాలి. ఇటువంటి భావాలన్నీ కూడా మన యందు ప్రబలాయనగా నేర్చుకొని అన్నివేళలా సత్య సాయి భగవానుడిని ఒక ఉదాహరణ ప్రాయంగా తీసుకొని అంత పెద్ద పని మనం చేయాల్సిన పని ఏం లేదు. మన సంపాదనలో మనం దాచుకున్న డబ్బులో వ్యసనాలకి వృథాగా ఖర్చు పెట్టకుండా దానిని పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో గనక చేసుకోగలిగినట్లయితే చందా వేయటం చాలా తేలిక. చెక్కు రాసి మీరు పనిచేసుకునేటట్లు ఇవ్వటం మం తేలిక. పెట్టటం వేరు పెట్టుకోవటం వేరు. ఉందే కదా. పెట్టటం వేరంటే dining table మీద అన్నం ఉంది మీరు తినండి అని అంటేది. పెట్టుకోవటం అంటే దాని దగ్గర ఉండి పెట్టి తినేదాకా ఉంచని, కడుపాలా తిన్నారా లేదా చూసుకుని మనల్ని ఆనంద పరిచేటువంటిది. కాబట్టి పెట్టటం నుంచి పెట్టుకోవటానికి వెళదాం. చూడటంలో నుంచి దర్శించటానికి వెళదాం. అనుకోవటం వినటంలో నుంచి ఆచరించే దిశగా వెళదాం. అదే మన నిజానికి స్వామికి చేసేటువంటి, ఇచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి నివాళి. సందర్భంలో ఈవేళచాలా ఏటయ్యింది ఒక సంకీర్తన చేయాలి అని అనిపించింది క్షణం మీరు కూడా వృద్ధులకు చెందిన వైద్యులు అక్కడే దగ్గరగా కాబట్టి అందరూ చక్కగా సత్యసాయి భగవానుడికి కూడా మనం ఆనందం కలిగించాలి. నేను భగవంతుణ్ణి భక్తితో చూడటం కాదు భగవంతున్ని నేను ప్రేమించ గలిగిన స్థాయికి నేను వెళ్ళాలి భగవంతుని మనం ఎలా ప్రేమిస్తాం అంటే స్థాయికి వెళితే ప్రేమించగలం లేకపోతే ఆరాధన దగ్గరే అయిపోతాం. సరే.వందే వందేశాయీషం vande vande saeeshom వందే వందే పతీశం vande vande patheeshem వందే వందే సాయీషం vande vande saeeshum వందే వందే పతీశం vande vnde pathesam వందే వందే మనో నతీషన్ vande vande manathishom వందే వందే హృదయ పాదీసం vande vande hrudaypatheeshm వందే వందే సా యీషమ్ vande vande saeshum వందే వందే పతీశం vande vande pathesham వందే వందే మనో నతీషున్ vande vande manothisham వందే వందే హృదయ పతీషమ్ vande vande hrudaya pathim నీ నిರಾకారమే సాకారమై nee niraakarame sakaarmai నీ గమనమే శ్రీకరమై nee gamaname sreekaramai నీ హృదయమే దయా కరమై nee hrudayamde daya karamai వందే వందే సాయి శం vande vande saecalm వందే వందే పతీశం vande vande pathesem వందే వందే మనో ప్రతీక్ష vande vande mannthishom వందే వందే హృదయ పతీష్ vande vande hrudaypatheeşam నీ సన్నిధానమే విధానమైnee sangithaname vidhanamai నీ సంకీర్తనే మనో రత్నమై nee sankearthanae manho rathanamai నీ తలపే nee thalape నీ తలపే nee thalapae అంతరంగ తరంగ మృతంగ నాదమై anthrangaha thranga mruthangga nadamaei సునాదమై sunadhammai వందే వందే సాయీశమ్ vande vande saekshmm వందే వందే పతీశమ్ vande vande pathesamm వందే వందే మనో నతీషమ్ vande vande manontheesam వందే వందే హృదయ పతీషమ్ vande vande hrudaya patheshm మీ అందరికీ సత్యసాయి భగవానుడు యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మహా అమృత వర్షివలె కురియాలని ఒక్క తరమే కాకుండా మీ అందరీ రాబోయే ఇరవైఒక్క తరాలు అన్ని కుటుంబాలు కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహ ప్రవాహంలో ఆನంద నట్టనం చెయ్యాలని స్వామి సదా రక్షణలై చలనలను రక్షించాలని నాలుగో జాతి సమృద్ధి పొండాలని సత్యసాయి నామం సత్యసాయి రూపం సత్యసాయి తత్వం వేనోళ్ల కొయ్యాడబడి ప్రపంచం అంతా కూడా ಪ್ರಶಾಂತమైన కావాలని అలా కావటానికి మన voisటుగా మన నೈతిక ధార్మికమైనటువంటి ప్రవర్తన మనం చక్కగా చేసుకోవాలని దానికి కావలసిన అటువంటి యుక్తిని భక్తిని శక్తిని అన్నింటినీ కూడా స్వామి మనకు പരിപൂർണ്ണంగా അനുഗ്രഹിക്കണമെന്ന് സ്വാമിനെ മനസ്സാ വചസ്సా ശിരസ്സാ പ്രാർത്ഥന చేస్తూ మీ అందరికి Sai Ram.[అందరూ కలిసి]:-ఓం జయ జగదీశ్ హరే Swami Satcharitire భక్తజనాസം భక్తജ ഭക്തജനാസം ಭಕ್ತjanasams bhaktajanasm ఓం ജയ Jagadīsha ഹരേ जय जगदीश हरे ಜಗದ Janani Dayara Saagaara Saagarambaje स्वामी सागर सागारम् बजे ಸ್ವಾಮಿ ಸಾಗರ ಸಾಗಾರಂ ಬಜೇ ಅಶಿತ ಕಲ್ಪವೃಕ್ಷीшь ಆಶಿത कल्पवृक्षಿś ಆಶಿತ ಕಲ್ಪವೃಕ್ಷಿś ನಾಗೋ സാഗരാ ಓಂ Jay jagadeesha hare [ all clapping ][సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
YouTube · audio

Sri Sathya Sai Premadhara | Spiritual Satsung | Part 2

Home

Sri Sathya Sai Premadhara | Spiritual Satsung | Part 2

Source: Sri Sathya Sai Seva Organisations Rajanna Sircilla on YouTube

0:00 / 47:20

More in this series

Sri Sathya Sai Premadhara — Spiritual Satsung

2 episodes · 1 hr 51 min

  1. 1 hr 3 min 1

    Sri Sathya Sai Premadhara July 2023 | Spiritual Satsung | Part 1

  2. 47 min 2

    Sri Sathya Sai Premadhara | Spiritual Satsung | Part 2

    Now playing